న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఐటీ ప్రొఫెషనల్ చారు మాథూర్పై పని భారం రెట్టింపయ్యింది. ఇంటి నుంచి పని చేయడంతోపాటు అదనంగా ఇంటి పని భారం మీద పడింది. రెండు విధులను నిర్వర్తిస్తూ 14 నెలల బాలుడి ఆలనా పాలన చూసుకోలేక ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటి వరకు చారు మాథూర్ ఆఫీసు పని మాత్రమే చూసుకుంటుంటే పని మనిషి ఇంటి పనులు చూసుకునేది. అయితే పని మనిషి నివసిస్తోన్న బస్తీలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో మాథూర్ ఉంటున్న అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ సొసైటీ పని మనుషుల మీద నిషేధం విధించింది.
మహిళా ఉద్యోగులపై పెరిగిన పని భారం