ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం

ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) ప్రయివేటు రంగ  దిగ్గజబ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్‌ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో  ఇవాళ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జోరుమీదుంది. గురువారం  ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్‌ 8.47 శాతం పెరగడం విశేషం.